పుల్వామా దాడి ఘటనతో.. ఎవరు లాభపడ్డారంటూ మోదీ సర్కారును కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా 40 మంది సైనికుల మృతి గుర్తు చేసుకున్నారు రాహుల్. ఈ దాడి అనంతరం జరిగిన విచారణలో ఏం తేల్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు. భద్రతా వైఫల్యాలకు కారణం బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు రాహుల్.