తాడేపల్లి గూడెం నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఓటమి తర్వాత కూడా అధైర్యపడకుండా పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను అభినందించారు. జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కులమతాల ఆధారంగా దేశం, రాష్ట్రం విచ్ఛిన్నం కావడం కరెక్టు కాదన్నారు. నేటీకి కులాలు, మతాల ప్రాతిపదికన మాట్లాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.
జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కమిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా.. ఆయన రాష్ట్ర లీగల్ సెల్ ఎఫైర్స్ కమిటీ భేటీ అయ్యారు. పలు చట్టపరమైన అంశాలపై లీగల్ సెల్ సభ్యులతో పవన్ చర్చించారు. ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చిన వందమంది న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.