ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్.. హక్కు కాదని సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో.. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ వర్గాలకు భరోసా కల్పించడం కోసం టీపీసీసీ ఆధ్యర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనలు, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. దళిత సీఎం అన్న కేసీఆర్.. తన కేబినెట్ లో ఒక్క దళితుడికి కూడా చోటివ్వలేదని దుయ్యబట్టారు.