అమరావతి ఉద్యమానికి విద్యార్థి లోకం మద్దతు పలికింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి.. వచ్చిన విద్యార్థి ప్రతినిధుల బృందం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తోంది.TNSF ఆధ్వర్యంలో బస్సు ర్యాలీ నిర్వహించారు. మందడం వచ్చిన విద్యార్థులు.. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
జగన్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు విద్యార్థులు. విశ్వవిద్యాలయాలను కూడా వైసీపీ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు.