తమిళనాడులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం జిల్లా ఓమలూరులో టెంపో వాహానాన్ని బస్సు ఢీ కొట్దింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరంతా.. నేపాల్వాసులుగా గుర్తించారు. తీర్థయాత్ర కోసం వీరు భారత్కు వచ్చారు. అతివేగమే.. ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.