71వ రోజుకు చేరినా అమరావతి ఉద్యమంలో ఏమాత్రం జోరు తగ్గలేదు. రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. రైతులు, మహిళలు సంఘటితంగా రాజధాని కోసం పోరాడుతున్నారు. దీక్షలు, ధర్నాలతో సర్కార్ తీరుపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతి నగరాన్నే కొనసాగించాలంటూ.. 29 గ్రామాల రైతులు పోరుబాట కొనసాగిస్తామంటున్నారు రాజధాని రైతులు.