కంది రైతులు రోడ్డెక్కుతున్నారు. కొనుగోళ్లలో కొత్త నిబంధనలు, ఆంక్షలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కంది క్వింటాకు 5800 రూపాయల మద్దతు ధర ప్రకటించిన సర్కారు.. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తోంది. అయితే ఒక్కో పాస్బుక్పై కేవలం 10 క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేస్తుండడం.. రైతులకు ఇబ్బంది కరంగా మారింది.