రాజధాని రైతులతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది: ఎంపీ జీవీఎల్

Update: 2020-02-28 19:21 GMT

73 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. అయితే ప్రజాప్రతినిధులు వచ్చేందుకు అనువైన వాతావరణం కూడా అక్కడ ఉండాలన్నారు. ప్రభుత్వం, రైతులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. ఘర్షణతో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు. రాజధాని అంశం రాష్ట్రపరిధిలోనే ఉంటుందని.. కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ మరోసారి స్పష్టం చేశారు.

Similar News