దేశానికి CAA చాలా అవసరమని బీజేపీ ఎంపీ శశికళ పుష్ప అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారామె. అంతేకానీ.. దేశ ప్రజలకు ఎలాంటి హాని ఉండబోదని శశికళ పుష్ప చెప్పారు. తొలుత బిల్లుకు మద్దతిచ్చిన కాంగ్రెస్.. అల్లర్లు ప్రోత్సహిస్తోందని విమర్శించారు.