రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కీలక పదవి

Update: 2020-03-02 08:41 GMT

ఏపీ సీఎం జగన్‌ సలహాదారుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించింది. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన ఈయన గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.

Similar News