భాగ్యనగరాన్ని కరోనా భయపెడుతోంది. ఇప్పటికే ఒక పాజిటివ్ కేసు నమోదవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మహేంద్ర హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడి నివాస ప్రాంతమైన మహేంద్రహిల్స్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా చర్యలలో భాగంగానే చర్య తీసుకున్నట్లు స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. అటు తల్లిదండ్రులు సైతం వాట్సప్ గ్రూపుల ద్వారా విషయం తెలుసుకుని పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు.