కరోనా వైరస్తో కర్ణాటకలోనూ ఆందోళన నెలకొంది. దీంతో.. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులను సైతం పరిశుభ్రం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా.. అన్ని బస్సుల్ని క్లీనింగ్ చేస్తున్నారు.