అమరావతి గొంతుక అంతర్జాతీయ వేదికలపైనా వినిపిస్తోంది. రైతుల ఆవేదన, ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెబుతున్నారు అమెరికా NRIలు. అమరావతిలో రైతులు, మహిళలపై జరుగుతున్న దమనకాండ, హక్కుల ఉల్లంఘనలపై జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు NRI శ్రీనివాసరావు కావేటి. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలలను ఫిర్యాదులో ప్రస్తావించారు. అటు ఇంతకుముందే నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు కావేటి.