కరోనా వైరస్ భయపెడుతోంది. మన వాతావరణంలో దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నా.. ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారి ద్వారా కరోనా విస్తరిస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. సాధారణంగా కరీంనగర్ జిల్లా వాసులు గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు.