ఏపీలో వైసీపీ నేతల వేధింపులు ఆగడం లేదు. తాజాగా వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరులో జరిగింది.
వైసీపీ నేత చెల్ల బాలేశ్వర్రెడ్డి, ఇతరులు.. తమ పొలంలో రాళ్లు పాతుతున్నారని ఆవేదన చెందిన భూ లక్ష్మీ అనే మహిళా రైతు.. పురుగుల మందు తాగింది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనపై.. విచారణ చేస్తున్నారు పోలీసులు.