ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారైంది. ఈనెల 8న సభలో ఆర్థిక మంత్రి హరీష్రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు.. 9, 10, 15 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు.