యెస్ బ్యాంకు సంక్షోభంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Update: 2020-03-06 20:02 GMT

యెస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఖాతాదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యెస్ బ్యాంకు కస్టమర్ల సొమ్ము సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. 50 వేల నగదు ఉపసంహరణ పరిమితి తాత్కాలికమేనని అన్నారు. ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడానని.. సత్వర పరిష్కారం దిశగా ఆర్బీఐ కృషి చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు.

Similar News