కర్ణాటక పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఉపఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. కేపీసీసీ అధ్యక్ష పదవికి దినేష్ గుండురావు రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న నియామకాన్ని ఇప్పుడు పూర్తి చేశారు. డీకే శివకుమార్కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వర్ ఖండ్రేను యథావిధిగా కొనసాగించడంతో పాటు మరో ఇద్దరిని కొత్త కార్యనిర్వహాక అధ్యక్షులుగా నియమించారు. దీంతో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు అయ్యారు. సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య కొనసాగుతారని ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.