తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తుల పట్ల కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పట్ల సుప్రీంకోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఈ సందర్భంగా ధర్మాసనం ముఖ్యమంత్రికి పలు సూచనలు చేసింది. కోర్టు తీర్పుల పట్ల విమర్శనాత్మకంగా అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందన్న ధర్మాసనం.. బాధ్యత గల పదవుల్లో ఉన్న నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.