ఇరాక్లోని అన్బర్ ప్రావిన్స్లోని స్థానిక సాయుధ ముఠా స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సాయుధ దళాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందడంతో అమెరికా కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 3100 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 2600 పాయింట్లకు పైగా నష్టపోయాయి. బీపీసీఎల్, యెస్ బ్యాంక్లు 15శాతం పైగా, ఎస్బీఐ, వేదాంతా, ఐటీసీలు 13శాతం పైగా నష్టపోయాయి.