నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ కార్యకర్తలు దాడి

Update: 2020-03-11 19:24 GMT

గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే టీడీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. నర్సరావుపేటలో నామినేషన్‌ వేయడానికి వస్తున్న టీడీపీ అభ్యర్థులపై మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

 

Similar News