విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబుకు CRPC 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ప్రశ్నించింది హైకోర్టు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ముందు వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు డీజీపీని ఆదేశించినట్లు లాయర్లు తెలిపారు.