పౌల్ట్రీ ఫెడరేషన్లో అక్రమాలు జరిగాయంటూ.. అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క్ చేసిన ఆరోపణలను మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. పౌల్ట్రీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందన్నారు. మొక్కజొన్న కోసం ప్రభుత్వం నష్టాలను భరించి కూడా.. పౌల్ట్రీ రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈటల హితవు పలికారు.