న్యాయస్థానం చివాట్లు పెట్టినా.. ఇంకా డీజీపీకు బుద్ధి రాలేదన్నారు.. మాజీ మంత్రి చినరాజప్ప. మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూలేని భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మానవహక్కుల కమిషన్తోపాటు, ఎస్సీ-ఎస్టీ కమిషన్లను ఆశ్రయించి న్యాయం కోరాతామన్నారు చిన రాజప్ప.