గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. 9వ వార్డు టీడీపీ అభ్యర్థి తరపున నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళపై దౌర్జన్యం చేశారు. మహిళ చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలతో పాటు సెల్ఫోన్ను లాక్కుని కాల్వలో పడేశారు. ఆ మహిళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే బైటాయించి నిరసన కొనసాగిస్తోంది.