తెలంగాణలో మరో అనుమానిత కరోనా కేసు నమోదు అయింది. మంచిర్యాల జిల్లాలోని సీసీ కాలనీ నస్పూర్కు చెందిన యువకుడు జలుబు, జ్వరంతో బాధపడుతుండంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. 10 రోజుల క్రితం ఇటలీ నుంచి యువకుడు వచ్చారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి 3రోజులుగా విపరీతంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అటు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు.