ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అయితే కరోనా వైరస్ సోకితే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందంటూ ఏపీ సీఎం జగన్ చెప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు కనిపిస్తున్నాయి. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా జబ్బు పోతుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.