ఎలక్షన్ కమిషనర్‌ను జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కన్నా

Update: 2020-03-16 16:52 GMT

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా.. వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. కాళహస్తిలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయని ఎస్పీకి చెప్పినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా అసలు జబ్బే కాదని సీఎం జగన్‌ చెప్పడం హాస్యస్పదమని విమర్శించారు. చివరకు ఎన్నికల కమిషన్‌ని కూడా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.

Similar News