కరోనా ప్రభావం ఆలయాలపైనా పడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నియంత్రణ చర్యలు చేపట్టగా... శ్రీకాళహస్తిలోనూ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుకేతు పూజలను 11 రోజులపాటు నిలిపివేశారు. దీంతో ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే రాహుకేతు మండపాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే భక్తుల రాక భారీగా తగ్గిపోయింది.