కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని లోక్సభ ఎంపీ, మాజీ హీరోయిన్ నవ్నీత్ కౌర్ సూచించారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మాట్లాడారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండవద్దని కోరారు. పార్టీలకు.. సమావేశాలకు వెళ్లి.. పార్లమెంట్కు వచ్చే సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా సభలోకి వచ్చే సభ్యులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.