కరోనా కట్టడిలో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు వేగంగా స్పందిస్తున్నారు. ఖమ్మంలో కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్లలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రజలకు నిత్యావసరాలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ కూరగాయలు, మాస్కులు, పాలు, నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.