దేశంలో 700 మందికి పైగా కరోనా వైరస్

Update: 2020-03-27 10:14 GMT

ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో ఏడుగురు రోగులు మరణించారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 700 దాటింది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Similar News