నిజామాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

Update: 2020-03-28 17:52 GMT

అటు.. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా కల్లు దొరక్క ఓ వ్యక్తి మృతి చెందాడు. కల్లుకు బానిసైన చాలా మంది బాధితులు వింత వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింత చేష్టలు చేస్తున్నారు. ముదిరాజ్‌ గల్లికి చెందిన భూషణ్‌ గత కొన్ని రోజులుగా కల్లుకు బానిసయ్యాడు. గత నాలుగు రోజులుగా కల్లు దుకాణాలు మూతపడడంతో ఫిట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కటుంబంలో విషాదం నెలకొంది.

Similar News