ఏపీలో రోజురోజుకి కరోనా విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ బులెటిన్ విడుదల చేశారు. తాజా కేజులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కరోనా సోకినా వారి సంఖ్య 111కి చేరింది.