మర్కజ్ గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనాపై కేంద్రం ఇంకా యాక్టివ్గా పనిచేయాలని సూచించామని అన్నారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేసిన మొదట సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్డౌన్ ప్రకటించామని చెప్పారు. తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని, గాంధీలో చికిత్స పొందుతున్న 10మందికి నెగెటివ్ వచ్చిందని, వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు చనిపోయారని ఈటల రాజేందర్ తెలిపారు.