సామాజిక దూరాన్ని పాటిస్తే కరోనాను కొంతవరకు అరికట్టగలమని ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించారు. అది ఈ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. మరి దాని తరువాత పరిస్థితి ఏంటని అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన ట్వీట్లో ప్రస్తావించారు. 21 రోజుల లాక్డౌన్ తరువాత కూడా ప్రజలు అదే విధమైన జాగ్రత్తలు పాటించాలని, అందరూ బాధ్యతతో ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, మాస్క్లను వినియోగించాలని మోదీ సూచించినట్లు ఆయన తెలిపారు.