తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజే ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.