కరోనా కట్టడికి వ్యతిరేకంగా డి-మార్ట్ రిటైల్ సంస్థ రంగంలోకి దిగింది. పిఎం కేర్స్ ఫండ్ అలాగే వివిధ రాష్ట్ర సహాయ నిధులకు రూ .155 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ప్రమోటర్ రాధాకిషన్ దమాని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు, దమాని పిఎం కేర్స్ ఫండ్కు రూ .100 కోట్లు, పదకొండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రిలీఫ్ ఫండ్లకు రూ .55 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.