కేంద్రమంత్రులతో సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Update: 2020-04-05 00:03 GMT

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మోదీ సర్కార్ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.

Similar News