గోడ పగలగొట్టి మద్యం దొంగతనం

Update: 2020-04-04 23:10 GMT

రూమ్ గోడలు పగలగొట్టి దుండగులు మద్యం దొంగతనం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఓ వైన్స్‌ షాపులో దుండగులు మద్యం దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణం వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ. లక్ష విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News