ప్రపంచ దేశాల్ని గజగజ వణికస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ను 82 ఏళ్ల వృద్ధుడు జయించాడు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో అతడిని దిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్నారాయణ్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైదులు తెలిపారు. తాజాగా పరీక్షల్లో రిపోర్టులు నెగటివ్గా రావడంతో అతడిని వైద్యులు మంగళవారం డిశ్చార్జి చేశారు.