గత 24 గంటల్లో 1035 కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 7447కు చేరుకున్నాయని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో 40 మంది చనిపోయారని.. మొత్తం మరణాల సంఖ్య 239కి చేరుకుందని ఆయన తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు 642 మంది కరోనా నుంచి పూర్తగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని లవ్ అగర్వాల్ చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎప్పుడు నమోదు కాలేదు. దీంతో అధికారిక వర్గాలు తీవ్ర ఆందోళన చెబుతున్నాయి.