కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశాఖ జిల్లా అక్కయ్యపాలెంను రెడ్ జోన్ గా మార్చి వేశారు. అయితే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకష్టాలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రజలను అధికారులు గాలికొదిలేశారు. ఇంట్లో సరుకులు నిండుకోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నా అధికారుల నుంచి ఆదేశాలు వస్తే గానే ఏమి చెయ్యలేని పరిస్థితి. అధికారుల వద్ద పక్కా ప్రణాళికలు లేకపోవడం, సరుకుల పంపిణీలో సమన్వాయ లోపం ప్రజలకు శాపంగా మారింది.