కరోనా కట్టడిలో భాగంగా దేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బెంగళూరులో కొందరు ప్రయాణిస్తున్నారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి .. బైప్పనహల్లి పోలీసు స్టేషన్ చెక్పోస్టు వద్ద ఓ వాహనాన్ని ఆపారు. అయితే ఆ వాహనం వెనుక భాగంలో ప్లాస్టిక్ సంచిలో కట్టేసిన ఆవుదూడను పోలీసులు కనుగొన్నారు. దుండగులను అదుపులోకి తీసుకుని విచారించగా.. రోడ్డుపై వదిలేసిన ఆవు దూడను తాము తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పారు. దీంతో ఆవు దూడను పోలీసులు చేరదీశారు. ఆ ఆవుదూడకు పోలీసులే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు.