ఐసోలేషన్ వార్డులో ఉండటం ఇష్టంలేక కరోనా రోగులు పారిపోయిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇండోర్ లో రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు నుంచి ఉన్న ఆరుగురు కరోనా రోగులతో పాటు మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు తెలిపారు. హోటల్ గేటు వద్ద పోలీసులు ఉండటంతో 40 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న ఎనిమిది మంది వెనక గోడ దూకి తప్పించుకున్నారని తెలిపారు.
పారిపోయిన వారిలో ముగ్గురిని పోలీసులు వెతికి పట్టుకున్నామని.. మిగితా ఐదుగురు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ ఐదుగురు ఉత్తర్ప్రదేశ్లోని రామ్పూర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఐసోలేషన్ వార్డులో 17 రోజుల నుంచి ఉండటంతో.. పూర్తిగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందనే భయంతోనే ఈ పని చేశామని దొరికిన ముగ్గురు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.