మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు హీరో నిఖిల్, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతి పెళ్లికుమార్తెల వివాహం వివాహం బెంగళూరులో జరిగింది. రామ్నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్లో జరిగిన ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు.
పెళ్లి కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారా స్వామీ తనయుడు అయినా నిఖిల్ జాగ్వార్ సినిమాలో హీరోగా నటించారు. అటు.. 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు.