గుజరాత్లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గుజరాత్లో 12 గంటల్లోనే 228 కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయానికి 12 గంటల వ్యవధిలోనే కొత్తగా 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1604కు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.