ఇండోనేషియాలో ఆదివారం ఒక్కరోజే కరోనా కేసులు 327 నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,575కు చేరుకుంది. కొత్తగా మృతి చెందిన వారి సంఖ్య 47 కాగా మొత్తం మృతులు 582. మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని ఇండోనేషియా వైద్యుల సంఘం ఆందోళన చెందుతోంది. శుక్రవారం నాటికి ఇండోనేషియా ఫిలిప్పీన్స్ను అధిగమించి ఆగ్నేయాసియాలో అత్యధిక ఇన్ఫెక్షన్లు కలిగిన దేశంగా అవతరించింది.