దేశంలో స్వైర విహారం చేస్తోన్న కరోనా వైరస్ హర్యానాలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసిరింది. హర్యానాలో భోండ్సీ జైలు వార్డెన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైరస్ విస్తరించకుండా జైలు కాలనీ మొత్తాని అధికారులు శానటైజ్ చేశారు. సెలవులపై ఏప్రిల్ 9న భివానీలోని తన ఇంటికి వెళ్లిన వార్డెన్ ఇటీవల విధుల్లో చేరాడు. అయితే అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్కు తరలించారు.