కరోనా వార్తలను కవరేజ్ చేస్తున్న పాత్రికేయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విజ్ఞప్తి చేశారు.ఆయా మీడియా యజమాన్యం కూడా వారి ఉద్యోగుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేశంలోని పలు ప్రాంతాలలో పాత్రికేయులు కరోనా బారినపడ్డట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక రిపోర్టర్లు, కెమెరా మెన్లు, ఫొటోగ్రాఫర్లు.. కరోనా వార్తలు కవర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సూచించింది. కంటెయిన్ మెంట్ జోన్లు, హాట్స్పాట్లలో కూడా వార్తలను కవరేజ్ చేస్తున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.